Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshKadapa జయమ్మకు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ..

జయమ్మకు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ..

by Rama
Jayamma

దివంగత వైయస్ రాజారెడ్డి సతీమణి వైయస్ జయమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ పులివెందులలోని వైఎస్ జయమ్మ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జయమ్మ 18 వ వర్ధంతి సందర్భంగా ఆమె పులివెందులకు చేరుకొని పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వైఎస్ జయమ్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆమె వెంట మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి వైయస్ సౌభాగ్యమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతి, వై ఎస్ వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014162
Total views : 79332

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.