Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra PradeshKadapa వైసీపీ నేతలపై ఆగ్రహం.. సైకిల్ ఎక్కేందుకు సన్నాహాలు..

వైసీపీ నేతలపై ఆగ్రహం.. సైకిల్ ఎక్కేందుకు సన్నాహాలు..

by Rama
YCP Leaders

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఆయనపై కరుడుగట్టిన అభిమానుల్లో కూడా వ్యతిరేకత మొదలైంది. కడప నగరంలో వైసిపీ కి జనం మాత్రమే కాదు… సొంత బ్యాచ్ వ్యతిరేకంగా మారుతున్నారు. ఒకరిద్దరు కాదు 22 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడే యోవచనలో ఉన్నారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఓ ముఖ్య నేత తమకు కనీసపాటి విలువ ఇవ్వకపోవడం… ప్రభుత్వ తీరుతో జనంలో తమ పట్ల వ్యతిరేకత పెరగడంతో కార్పొరేటర్లు ఆందోళన చెందుతున్నారు. వీరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతుండటంతో కడప రాజకీయాలు కాకరేపుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జమానా నుంచి వారి కుటుంబాన్ని కడప అక్కున చేర్చుకుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో కడపపై తన మార్పు చూపించుకున్నారు. మున్సిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్ గా మార్చారు. 2005 తర్వాత వరుసగా అప్పట్లో కాంగ్రెస్ తర్వాత వైసీపీనే కడప మేయర్ పదవి చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కార్పొరేటర్లు అంతా కాంగ్రెస్ కు బై చెప్పి వైసీపీ గూటికి చేరారు. 2014-19 ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించారు. కడప కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉండగా…వీరిలో ఒకరు టిడిపి..మరొకరు ఇండిపెండెంట్ గా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుస్తుంది అనే పాజిటివ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయింది. ఈసారి టిడిపి వస్తుందనే నమ్మకం వైసీపీ వీరాభిమానుల్లోను బలబడింది. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్న కార్పొరేటర్లు ఒక అంచనాకు వచ్చారు. ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అనే నిర్ణయానికి వచ్చారు. దీంతో కొందరు వైసీపీ కార్పొరేటర్లు టిడిపి నాయకులతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

039902
Total views : 201568

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: