కాకినాడ జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్(జేసీ) సీ.ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జేసీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఆయన కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి, డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, పౌరసరఫరాల సంస్థ డీఎం డీ.పుష్పమణి, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్.సూర్యప్రకాశరావు, ఏడి సర్వే బి.లక్ష్మినారాయణ, కలెక్టరేట్ ఏవో జీఎస్ఎస్ శ్రీనివాసు, వివిధ విభాగాల అధిపతులు పలువురు ఇతర అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
రెవిన్యూ సమస్యల పరిష్కారానికై కృషి..
269
previous post




Total views : 92740