Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshVishakapattanam రాజకీయ నాయకులు సంస్కారాన్ని మరిచి బూతులు..

రాజకీయ నాయకులు సంస్కారాన్ని మరిచి బూతులు..

by Rama
Politicians

రాజకీయ నాయకులు (Politicians):

రాజకీయ నాయకులు (Politicians) సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్నారని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు నేతలు అపహాస్యపు పనులు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి పోలింగ్ బూత్ లలో సమాధానం చెప్పాలని అన్నారు. చదువు ఎంత ముఖ్యమో, సంస్కారం కూడా అంతే ముఖ్యమని అన్నారు. స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. విశాఖలోని ఓ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మాతృభాష కళ్లు లాంటిదని… తల్లిలాంటి భాషను ఎవరూ మర్చిపోకూడదని వెంకయ్య చెప్పారు. విలువలతో కూడిన విద్య ఉంటేనే విలువలతో కూడిన పౌరుడిగా తయారవుతారని అన్నారు. ఇప్పుడు విలువలతో కూడిన విద్య తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో ఉన్న మేధోశక్తి వల్ల ప్రపంచమంతా మనవైపు చూస్తోందని చెప్పారు. భగవంతుడు ఏం కావాలని అడిగితే మళ్లీ విద్యార్థి దశకు తీసుకెళ్లాలని కోరుకుంటానని అన్నారు. గూగుల్ అనేది గురువుని మించింది కాదని చెప్పారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. Read Also..

Follow us on :Facebook, Instagram& YouTube.

  • ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
  • చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
    నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014136
Total views : 79138

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.