Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధుల విడుదల…

వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధుల విడుదల…

by Prakash
YSR Rythu Bharosa Scheme fund release

ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధులను విడుదల చేశారు. రైతుల ఖాతాల్లోకి ఒక వేయి 78 కోట్ల నగదును బదిలీ చేశారు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని జగన్ అన్నారు. గత 57 నెలల్లో రైతు భరోసా రూపంలో 34 వేల 288 కోట్లు అందించామని వెల్లడించారు. ఈ పథకం కింద 54 లక్షల మంది లబ్ది పొందుతున్నారని సీఎం జగన్ తెలిపారు. తమది రైతు ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఏపీలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారని, అర హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారని… అలాంటి రైతులకు తాము అందించిన పెట్టుబడి సాయం ఎంతో ఉపకరించిందని తెలిపారు. ఇక, అర్హులైన రైతులకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా విడుదల చేసినట్టు సీఎం జగన్ వెల్లడించారు. సుమారు 11 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద 216 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014687
Total views : 80849

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.