Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home International ఇజ్రాయెల్ పై క్షిపణి దాడిలో భారతీయుడు మృతి..!

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడిలో భారతీయుడు మృతి..!

by Satya
Indian was killed in a missile attack on Israel

ఇజ్రాయెల్(Israel):

ఇజ్రాయెల్(Israel) పై లెబనాన్ టెర్రర్ గ్రూపు జరిపిన క్షిపణి దాడిలో భారతీయుడు మృతి చెందారు. మరో ఇద్దరు భారతీయులకు తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తి సహా గాయపడ్డ ఇద్దరూ కేరళవాసులని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నార్తరన్ ఇజ్రాయెల్(Israel) లోని మార్గలియత్ పై నిన్న క్షిపణి దాడి జరిగింది. లెబనాన్ వైపు నుంచి దూసుకొచ్చిన మిసైల్ వ్యవసాయ క్షేత్రంలో పడడంతో భారీ పేలుడు సంభవించింది.

ఇది చదవండి: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం..!

ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. బాధితులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. ఈ దాడిలో కేరళ(Kerala)లోని కొల్లాంకు చెందిన మాక్స్ వెల్ చనిపోయాడు. ఇడుక్కి జిల్లా వాసి పాల్ మెల్విన్ తో పాటు బుష్ జోసెఫ్ లకు చికిత్స అందిస్తున్నామని బెయిలిన్సన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మెక్సికోలో దుండగుడి కాల్పులు..
మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా 10 …
US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..
అమెరికా వైమానిక విన్యాసాల్లో ప్రమాదం జరిగింది. US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ …
ఆఫ్రికాలో ఎబోలా కలకలం..
ఆఫ్రికా ఖండంలో ఎబోలా పంజా విసురుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

014542
Total views : 80442

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.