నంద్యాల పద్మావతి నగర్ లో జనసేన కార్యాలయంను టిడిపి అభ్యర్థి ఫరూఖ్, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎవి సుబ్బారెడ్డి, న్యాయవాది తులసి రెడ్డి లు ప్రారంభించి జనసేన జెండాను ఆవిష్కరించారు. జనసేన కన్వీనర్ విశ్వనాథ్, సుధాకర్ లు మాట్లాడుతూ సేవ కోసమే మా నాయకుడు ప్రజల్లోకి వచ్చాడనీ,తన సొంతంగా కష్టపడి తాను తీసిన సినిమాలు నుంచి వచ్చే డబ్బుతోనే నేటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలు నడిపిస్తూ ప్రమాదాలలో మరణిస్తున్న కార్యకర్తలకు గాని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గాని తన సొంత డబ్బులు వెచ్చించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కేవలం ప్రజలకు జరుగుతున్న అన్యాయం ప్రజల్లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉన్మాదైనా జగన్మోహన్ రెడ్డిని ప్రజల జీవితాలు బాగుపడడం కోసం గద్దె దింపడానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని గెలుపే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఉమ్మడి అభ్యర్థి ఫరూక్ గెలుపుకు కృషి చేయాలని జనసేన నాయకులకు ,కార్యకర్తలకు పిలుపునిచ్చి రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించి ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేకూర్చేయాలా చూడాలని ఈరోజు టిడిపితో పొత్తు పెట్టుకోవడం జరిగిందని అన్నారు.
నంద్యాలలో జనసేన కార్యాలయం ప్రారంభం…
343
previous post





Total views : 199254