బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు బయటకు తీస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ఏం చేసినా తమ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన మాటలకు తాము అగస్ట్లో సమాధానం చెబుతామన్నారు. అసలు ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీలో లీడర్లకు కొదవ లేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని విమర్శించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు నిద్రపట్టడం లేదన్నారు. తామే దేశభక్తులమని బీజేపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు – జగ్గారెడ్డి
328
previous post





Total views : 89968