సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ కు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి భార్యభర్తలిద్దరూ సాప్ట్ వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల వయసు గల ఒక పాప శ్రీహా, శ్రీ హాన్స్ కవలపిల్లలు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరగడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి శ్వేత నిన్న రాత్రి స్కూటీపై అమీన్ పూర్ పెద్ద చెరువుకు వచ్చారు. తన పిల్లలతో కలిసి ఒక్కసారిగా చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, కానిస్టేబుల్ ప్రభాకర్ గుర్తించి తల్లి, పాపను ప్రాణాలతో బయటకు తీశారు. చెరువులో మునిగిపోయిన బాబు శ్రీహన్స్ కోసం గాలించగా ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.