వచ్చే నెల జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిండంకోసం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త చట్టాలపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సెంట్రల్ జోన్ పరిధిలోని శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీస్ అధికారులతో పాటు ఇతర వివిధ విభాగాలయిన ట్రాఫిక్, సిసిస్. సిసిఆర్బి, స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, సైబర్ క్రైం విభాగాలకు చెందిన పోలీస్ అధికారులకు స్థానిక ఎల్. బి కళాశాల లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులకు పోలీస్ అధికారులు, సిబ్బంది విడతల వారిగా హాజరువుతున్నారు.రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో ముందుగా శిక్షణ పొందిన అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతుల్లో పోలీస్ అధికారులకు కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్యా అధినియం-2023 చట్టాలపై పై పూర్తి అవగాహన కలిగించడం జరుగుతోందని. ఈ నెల 6వ తేది నుండి ప్రాంభమైన ఈ శిక్షణ తరగతుల్లో ఇప్పటి వరకు 740 మంది పోలీస్ అధికారులు శిక్షణ పొందారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 30 ముగుస్తాయని అధికారులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.