Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News తెలంగాణలో టిడిపి పూర్వ వైభవం తప్పదన్న “బక్కని”

తెలంగాణలో టిడిపి పూర్వ వైభవం తప్పదన్న “బక్కని”

by Rama
తెలంగాణలో టిడిపి పూర్వ వైభవం తప్పదన్న "బక్కని"

తెలంగాణను కెసిఆర్ పాలించే రోజుల్లో మొదట 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఆ తరువాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తన పార్టీలో అక్రమంగా చేర్చుకున్న రోజు అది తప్పని కనిపించలేదా..? ఇప్పుడు తనకు ఇదే పరిస్థితి ఎదురైతే అక్రమమని గగ్గోలు పెడుతున్న కేసిఆర్ మందిది మంగళవారం.. మనది సోమవారం అనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు విమర్శించారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గూడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను బక్కని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అనేకమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో అక్రమంగా కలుపుకున్నప్పుడు అది తప్పని అనిపించని కేసీఆర్ ఇప్పుడు ఇతరులను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నించే వారిని పలుచగా చూసి ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు పనులు కావున చెడు సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఇప్పుడు అదే అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో సొంత స్వార్థం కోసం పనిచేసేవారు ఎప్పుడు బాగుపడరని, ప్రజల కోసం పనిచేసిన వాళ్లే నిలదొక్కుకుంటారని పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..
    దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ మ‌నోజ్ మంచు, త‌న స‌తీమ‌ణి భూమా మౌనిక‌తో క‌లిసి సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలో దాస‌రి ఘాట్ దుస్థితిపై యాంక‌ర్ గౌత‌మి షేర్ చేసిన వీడియోపై…
  • అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..
    అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కలకలం రేపింది. గాలివీడు మండలం అరవీడు గ్రామం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.ప్రమాదం…
  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
    అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొందారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భజనల నడుమ…
  • గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..
    గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తైన వెంటనే జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పాలనా సౌలభ్యం…
  • ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …
    ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్‌నాథ్ , జోషిమఠ్, గోవింద్‌…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

018708
Total views : 89229

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.