Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana సమయ పాలన లేని ఉపాధ్యాయులు

సమయ పాలన లేని ఉపాధ్యాయులు

by Satya
సమయ పాలన లేని ఉపాధ్యాయులు

అటవీ గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థులు వచ్చినా సమయానికి ఉపాధ్యాయులు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాఠశాల భవనాలలోని తరగతి గదులలో టీచర్ల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న తిప్పాపురం పంచాయతీలోని పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. స్కూల్ కి వచ్చి విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చొని ఉపాధ్యాయుల రాక కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తిప్పాపురం పంచాయతీలోని కలిపాక, కొత్త గుంపు, తిప్పాపురం గ్రామంలోని పాఠశాలలో సమయ పాలన లేని ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తున్నారు. ఉపాధ్యాయుల పాఠశాలకు ఆలస్యంగా ప్రతిరోజు వస్తుండడంతో స్కూల్ కు వచ్చిన విద్యార్థులు ఆరుబయట ఆడుకోవడం, పాఠశాల దగ్గరలో ఉన్న చెట్లపైకి ఎక్కి ఆడుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి టీచర్లు రెండు మూడు గంటలు ఆలస్యంగా వస్తున్నారు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని సమయానికి ఉపాద్యాయులు పాఠశాలకు వచ్చేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రుల కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..
    మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
  • ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
  • పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
    కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
  • మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
    పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
  • అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
    అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009388
Total views : 62255

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.