ఈ ఏడాది జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. జులై 18న మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ చేసింది. ఆగస్ట్ 15 వరకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడుతాల్లో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడత నిధులను ఖమ్మం సభలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో మొత్తం రుణాలు తీసుకున్న రైతులు 32 లక్షల 50 వేల మంది ఉన్నారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31 వేల కోట్ల రుణమాఫీకి అవసరం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. జులై 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం నిర్వహించింది. లక్ష నుంచి లక్షా 50 వేల వరకు రుణాలున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మూడో విడతలో లక్షా 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. ఇక 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు విడుతాల్లో దాదాపు 12 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడతలో రుణమాఫీ చేయడానికి 6 లక్షలకు పైగా రైతులు ఉంటారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వాటికి దాదాపు 6 వేల నుంచి 7 వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ బ్యాంకర్లు పెట్టిన మెలికలతో చాలామంది రైతులకు రుణమాఫీ అవ్వక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం బ్యాంకర్లకు సూచనలు చేయనుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సీఎం రేవంత్రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్స్వామి.సీఎం రేవంత్రెడ్డిని MCHRD బోధి పెవిలియన్లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపైన ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు…
- అంగరంగవైభవంగా కమర్షియల్ కోర్డ్ రూమ్ డ్రామా ‘డ్యూ డేట్’ చిత్రం ప్రారంభం.పీఆర్ఓగా, జర్నలిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్’ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో…
- త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి సమర్పణలో, శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత సావిత్రమ్మ నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి…
- తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది.…
- మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్.పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో సుమారు 440.42 కోట్ల నిధులు ఉన్నట్లు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 194328