మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద విచారించిన ఏపీ హైకోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల సమయంలో నమోదైన ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పలు షరతులు విధించింది. పాసుపోర్టును అప్పగించాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 26 నుంచి నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ మంజూరు కావటంతో కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి విడుదల. మరోవైపు సుమారు రెండు నెలలుగా నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.జిల్లా కోర్టులోనూ ఒకట్రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే జిల్లా కోర్టును వాటిని కొట్టివేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే పోలింగ్ సందర్భంగా పాల్వాయి గేట్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి. వీటితో పాటుగా కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు జూన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో నెల్లూరు జైలుకు తరలించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి