మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద విచారించిన ఏపీ హైకోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల సమయంలో నమోదైన ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పలు షరతులు విధించింది. పాసుపోర్టును అప్పగించాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 26 నుంచి నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ మంజూరు కావటంతో కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి విడుదల. మరోవైపు సుమారు రెండు నెలలుగా నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.జిల్లా కోర్టులోనూ ఒకట్రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే జిల్లా కోర్టును వాటిని కొట్టివేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే పోలింగ్ సందర్భంగా పాల్వాయి గేట్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి. వీటితో పాటుగా కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు జూన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో నెల్లూరు జైలుకు తరలించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పోలవరం బ్యాక్ వాటర్తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
- ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల సమావేశానికి తెలంగాణ…
- భారత్కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..భారత్-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది. భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు, ‘M777’ ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు, రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా…
- బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
- క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80800