డ్రోన్లను వినూత్నంగా ఉపయోగించేందుకు ఏపీ ప్రభుత్వం దేశం లోనే ఎక్కడా లేని విదంగా అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ను ప్రారంభించింది.తాజాగా ఏపీ పోలీసులు గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తో అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని వనభంగి పంచాయితీ జడిగూడ గ్రామ పరిధిలో గల అటవీ శాఖ భూముల్లో 15 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఎస్పి అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు గంజాయి తోటలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పెదబయలు మండలం వనభంగి పంచాయతీ జజిగూడ గ్రామ పరిధిలో గల అటవీ శాఖ భూముల్లో సాగు చేస్తున్నట్లు డ్రోన్ ల సహాయంతో గుర్తించారు.
ఈ మేరకు పెదబయలు ఎస్ఐ రమణ , అటవీశాఖ సెక్షన్ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.పెదబయలు స్థానిక ఎస్సై రమణ మాట్లాడుతూ.. అక్రమంగా సాగు చేస్తున్న 18 మంది రైతులు గుట్టుగా గంజాయిని సాగు చేస్తున్నారని ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి దహనం చేసినట్టు తెలిపారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి