Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana దూకుడు పెంచుతున్న హైడ్రా…

దూకుడు పెంచుతున్న హైడ్రా…

by Rama
దూకుడు పెంచుతున్న హైడ్రా...

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్లో హైడ్రా పంజా విసిరింది. మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ఏనుగు సురేందర్ రెడ్డి పార్కు స్థలాన్ని ఆక్రమించాడు. సురేందర్ రెడ్డి సుమారు వేయి గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించి, కంటైనర్ను ఏర్పాటు చేశాడు. గతంలో పలుమార్లు మున్సిపల్ అధికారులు పార్కు స్థలమని బోర్డు ఏర్పాటు చేశారు. అయినా ఆ సైన్ బోర్డును సురేందర్ రెడ్డి పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్కు స్థలం ఆక్రమణకు గురైందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్, పోలీసు సిబ్బంది స్పందించారు. సురేందర్ రెడ్డి అక్రమంగా ఏర్పాటు చేసిన కంటైనర్ను తొలగించారు. పార్కు స్థలాన్ని సురేందర్ రెడ్డి చెర నుంచి విడిపించి, మున్సిపల్ అధికారులకు అప్ప చెప్పారు. అధికారులు, ఆయా పార్టీ నేతల అండదండలతో బడంగ్ పేటలో కబ్జాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019098
Total views : 89904

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.