ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో..గెలుస్తుందో ఓడుతుందో..కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా..ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో..
ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో..ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో..అదే నా రాస్తా…’ అని ఉంది. 2029లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందన్నారు. పొత్తులతో వెళతామా.. ఒంటరిగా పోటీ చేస్తామా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. ఎవరు కలిసొచ్చినా రాకున్నా.. ప్రజల కోసం పోరాడతామని, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్నీ ప్రశ్నిస్తాం’ అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.
13
previous post




Total views : 92183