11
మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్ఆర్ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్లలో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, పవర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్పీఎస్ జోన్-2, 5, 9, 10, 12, 12 లలో సీఆర్ఆర్ఐ బృందం అధ్యయనం చేసింది. తమ అధ్యయనం తర్వాత రోడ్ల నిర్మాణంలో నిపుణులు పలు సూచనలు చేశారు. త్వరలో రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వానికి సీఆర్ఆర్ఐ నివేదిక ఇవ్వనుంది. మంత్రి తో సమావేశంలో సి.ఆర్.ఆర్.ఐ డైరెక్టర్ సీహెచ్ రవిశేఖర్, చీఫ్ సైంటిస్ట్ డా. కె. రవీందర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఫ్లెక్సిబుల్ పేవ్మెంట్ డా. భరత్,ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్ సీహెచ్.ధనుంజయ పాల్గొన్నారు.




Total views : 92198