అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు కేటాయించామని, రైతులకు ప్లాట్లు ఇవ్వలేదంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.ఏసీ గదుల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనిపించదని, క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. టెండర్ల ప్రకారమే రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో కొండవీటి వాగు, పాలవాగు పనులను పరిశీలించినట్లు తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే 69 వంతెనల వద్ద పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.
12
previous post




Total views : 92198