గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మెగా డీఎస్సీని నిర్వహించామని, ఐటీ సహా అనేక రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తున్నామని కూటమి కూటమి విద్యార్థి విభాగం నేతలు వెల్లడించారు . ఉద్యోగ కల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డగించేందుకు వైసిపి కోర్టుకు వెళుతుందన్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి, వలసలను నివారించడమే కాకుండా ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు .
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.
18
previous post





Total views : 92310