181
విశాఖపట్నం గాజువాక 65వ వార్డు బానోజీ తోటలో ఓటర్ నమోదు కార్యక్రమంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ నమోదు చేయాల్సిన సచివాలయ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. చదువు లేని వారు దరఖాస్తులు ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. దరఖాస్తులు తమరే నింపుకోవాలని, తప్పులు రాస్తే ఓటర్ కార్డు రద్దవుతుందని సిబ్బంది బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.