61
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారత రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా గుర్తింపు పొందిన కామరాజర్ 124వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెన్నైలోని మౌంట్ రోడ్డులో ఉన్న కామరాజర్ విగ్రహానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామరాజర్ దేశాభివృద్ధి, విద్యా రంగ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కామరాజర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు.





Total views : 212179