Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News కరీంనగర్‌ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన.

కరీంనగర్‌ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన.

by CVR NEWS
కరీంనగర్‌ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన

కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అంశాలపై స్పందించారు. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ యాజమాన్యం బలవంతంగా “కల్మా, సూరహ్ ఫతే” చదవాలని ఆదేశించడం దుర్మార్గమని ఆరోపించారు. ఇది హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై దాడిగా అభివర్ణిస్తూ దీనిని హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తే ఇటువంటి ఘటనలు తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే ఈ అంశంపై సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఆటో డ్రైవర్ భరత్ వ్యవహారంపై కూడా కేంద్ర మంత్రి స్పందించారు. భరత్‌ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, హిందువులను కించపరిచేలా ఉర్దూలో రాసిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని నిలదీశారు.రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్, హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటామని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040832
Total views : 212191

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: