తిరుపతి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలంలో నెన్నూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు సిద్దముని రెడ్డి, గిరిధర్ రెడ్డి.. అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది.
తిరుపతి జిల్లాలో వైసీపీ నుంచి పార్టీలో చేరిన సిద్దముని రెడ్డి, గిరిధర్ రెడ్డి సహా అనుచరులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 40 ఏళ్లకు పైగా ఒకే పార్టీలో ఉన్న సిద్దముని రెడ్డి కుటుంబం టీడీపీలో చేరడం శుభపరిణామమని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. టీడీపీపై విశ్వాసంతో పార్టీలోకి వచ్చిన సిద్దముని రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందరూ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.2024 ఎన్నికల తర్వాత పలువురు నాయకులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపారని,అయితే పార్టీలో చేరికల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.నాధముని రెడ్డి,గిరిధర్ రెడ్డి కుటుంబాలు పార్టీలో చేరతాయని ఊహించని మంచి పరిణామమన్నారు. వారి చేరిక పార్టీ బలోపేతానికి మరింత ఊతమిస్తోందన్నారు.
ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబం పార్టీలోకి రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తిరుపతి టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీ రెడ్డి కొనియాడారు. 80 ఏళ్లు దాటిన వయస్సులోనూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న కుటుంబానికి తాను అండగా నిలిచి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.సీనియర్ నేతల చేరికతో చంద్రగిరి నియోజకవర్గం లో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.



Total views : 221432