Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh అవినీతి నిరోధకశాఖకు ఏసీబీ కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్…

అవినీతి నిరోధకశాఖకు ఏసీబీ కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్…

by Prakash
Vijayawada ACB court

ప్రజాప్రతినిధులపై ఛార్జిషీట్‌ దాఖలు చేసేముందు… అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏ ప్రకారం, కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని అవినీతి నిరోధకశాఖకు విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చిచెప్పింది. అనుమతి తీసుకున్న తరవాతే అభియోగపత్రం దాఖలు చేయడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానమని స్పష్టం చేసింది. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందులు, వైద్యపరికరాల కొనుగోలుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై నమోదు చేసిన కేసులో, అభియోగపత్రం దాఖలు చేయడానికి ముందు గవర్నర్ నుంచి 17ఏ ప్రకారం అనుమతి తీసుకోలేదని ఏసీబీ కోర్టు అభ్యంతరం లేవనెత్తింది. అచ్చెన్నాయుడిపై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది.

Advertisements

You may also like

Our Visitor

039678
Total views : 199174

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: