తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం తిరుమల శ్రీవారిని 59,335 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ నెల 12న తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది.
Chittoor
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గత ఇరవై నెలలుగా ప్రతి నెల 100 కోట్లు హుండీ ఆదాయం భక్తుల కానుకల రూపంలో వస్తుంది. వరుసగా 20వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది. అక్టోబర్ లో కూడా హుండి ఆదాయం 108 కోట్లు వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి సాధారణంగా ఉంది. నిన్న దాదాపు 59,335 మంది తిరుమల శ్రీవారిని దర్శించుచున్నారు. అలాగే 23 వేల 271 మంది తలనీలాలు సమర్పించారు.నిన్న ఒక్కరోజు ఉండి ఆదాయం 3.29 కోట్లు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.వీరికి సుమారు సర్వదర్శనం 12 గంటల సమయం పడుతుంది.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి. రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు రెండు నెలలు ముందు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రాక్టర్లు పెద్దపెద్ద జేసీపీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నది ప్రజలకు సబకే సత్, సబ్కె వికాస్ ముందుకెళ్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.
బైరెడ్డిపల్లి మండలం, నెల్లిపట్లలో దళితులు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్లగా కటింగ్ షాప్ అతను నిరాకరించడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్డీవో మనోజ్ కుమార్ రెడ్డి నెల్లిపట్ల గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లో అన్ని కులాల వారు సోదరుల్లా మెలగాలని లేని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దళితులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దగ్గరుండి దళితులకు హెయిర్ కట్ చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు (38), భార్య నాగరత్నంమ్మ, ముగ్గురు పిల్లలు వీరిలో గారాబంగా పెంచుకున్న కూతురు ప్రేమ వ్యవహారం వల్ల తండ్రి శవమైనాడు. వివరాల్లోకి వెళితే తావడకుప్పం గ్రామనికి చెందిన గణేష్ (18)కూలీ పనులు చేసుకొంటూ నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు కూతురు వీణ ను ప్రేమించాడు. ఒక సంవత్సరం గా ప్రేమ వ్యవహారం సాగింది. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు. ఈ ప్రేమను తండ్రి అంగీకరించలేదు. కానీ తల్లి ,కూతురు కు ఇష్టం. తండ్రి అడ్డం ఉన్నాడని కట్టుకున్న భార్య,కూతురు, ప్రేమికుడు గణేష్ పథకం రచించి చంపి అతన్ని లక్కనపల్లి ఇసుక దిబ్బల్లో పూడ్చారని. ఈ వివరాలు గణేష్ ద్వారా పోలీసులు సమాచారం రాబట్టారని వీరి వెనుక ఇంకా ఎవరన్న ఉన్నారా అన్న కోణంలో వివరాలు రాబట్టడానికి పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం, ఈ కథనoపై వివరణ స్థానిక ఎస్ ఐ మోహన్ కుమార్ కోరగా 27 వతేది సాయంకాలం మిస్ అయినట్టు 30 వతేది ఉజ్జినప్ప గౌడు అన్న సొమప్ప గౌడు రక్షణ శాఖ లో పిర్యాదు చేయడం జరిగింది. ఇందులో నిజ నిజాలు తెలియబరుస్తామని ఎస్ ఐ మోహన్ కుమార్ ఒక తెలిపారు.
చిత్తూరు నగర శివారులోని చెర్లోపల్లి వద్ద ఘటన. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి మైసూర్ కి వెళుతుండగా ఘటన.. డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు మహిళలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. డ్రైవర్ శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సిఎంసి ఆసుపత్రి కి తరలించారు. చిత్తూరు తాలూకా ఎస్సై ఉమామహేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదకటనపై విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న సిఐ గంగిరెడ్డి…
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఏపీ ఎతిక్స్ కమిటీ ఛైర్మన్ మురుగుడు హనుమంతరావు విడివిడిగా శ్రీవారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు





Total views : 194318