Chittoor
చిత్తూరు జిల్లాలో 16 మంది టీచర్లకు డీఈఓ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదని గంగవరం మండలం యంఈఓ వేణుగోపాల్ రెడ్డి మరియు కీలపట్ల స్కూల్ హెచ్ఎం దామోదరం లను డీఈఓ విజయేంద్రరావు సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అలసత్వం వహించిన నగిరికి చెందిన 16 మంది ఉపాధ్యాయులకు సోకాజ్ నోటీసులును డీఈవో జారీ చేశారు.
రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల వ్యాపారస్తులు నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలని సత్యవేడు శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో టపాసుల విక్రయాలకు రెండు పర్మినెంట్ పర్మిషన్లు ఉన్నాయన్నారు. టెంపరరీ పర్మిషన్ కోసం పలువురు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. పోలీస్ రెవిన్యూ ఫైర్ శాఖల అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే టపాసుల విక్రయాలు నిర్వహించాలన్నారు. లైసెన్సులు మంజూరు కాకముందే టపాసులను నిల్వ ఉంచడం నేరమన్నారు. జన సమర్థ ప్రాంతాల్లో, ఇళ్లల్లో టపాసులను నిల్వ ఉంచుకోకూడదని స్పష్టం చేశారు. నేటి నుంచి టపాసు నిల్వలా కేంద్రాలపై తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జన సమర్థ ప్రాంతాల్లో ఎవరైనా టపాసు నిలువలను ఉంచినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టపాస్ విక్రయ కేంద్రాల వద్ద ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలను, అగ్ని నిరోధక సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Read Also..
తిరుమల శ్రీవారిని మంత్రి అమర్నాథ్ దర్శించుకున్నారు. జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందిందని క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు వస్తున్న పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు రావాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకోవాలని రావడం జరిగింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం లో 19 వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందని, అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పుంగనూరులో ఎనిమిది వేల కోట్లతో ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాబోవు రెండు మూడు నెలలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదట విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మాడ్యూల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి రానుంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నాయకులు మాటలు వీలును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి దొంగల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయాలు మాట్లాడటానికి తిరుమల వేదిక కాదు అన్నారు మంత్రి అమర్నాథ్..
చిత్తూరు జిల్లా పుంగనూరు నెక్కుంది చెరువు సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. పోలీసులు పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నగదు రూ. 19400/–లు స్వాధీనం చేసుకున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సి.ఐ.రాఘవ రెడ్డి.
Read Also..
సామాజిక సాధికారక బస్సు యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం లు అంజద్ భాష , నారాయణస్వామి, బిసి శాఖ మంత్రి వేణుగోపాల్, బీద మస్తాన్ రావు వంటి పలువురు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు కార్యక్రమానికి హాజరై సాధికార యాత్ర విజయవంతం చేశారని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అలిపిరి పాదాల మండపం, పార్వేట మండపం పై బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. తిరుమలలో వైల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పార్వేట మండపాన్ని మరమ్మత్తు చేసే అవకాశం లేనందునే జీర్ణోధరణ చేసామని, అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణను బిజేపీ వ్యతిరేకించడం సమంజసం కాదు అన్నారు. పాదాల మండపం పురావస్తు శాఖ పరిధిలో లేదని గుర్తు చేసారు. ఇంజనీర్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి…మరమ్మత్తులు అవకాశం లేదని తేల్చి చెప్పారు. 90శాతం స్తంభాలను వినియోగించే పాదాల మండలం పునరుద్ధరణ చేస్తాం అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, సునితమైన ఆంశాలపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం మంచి చర్య కాదు అని,మాజీ బోర్డు సభ్యుడిగా ఉండి భానుప్రకాష్ రెడ్డి కూడా టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. పార్వేట మండపం పరిశీలనకు బిజేపీ భానుప్రకాష్ ని నేను స్వాగతిస్తున్నా, మీడియా సమక్షంలో మండపం జీర్ణోధరణ పనులు పరిశీలించి నిజాలు భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు ఈఓ ధర్మరెడ్డి.
టిడిపి, బిజెపి, జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని, ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని ఆమే దర్శించుకున్నారు. ఆలయ మర్యాదులతో స్వాగతం పలికి స్వామి వారి దర్శిన బాగ్యం కల్పించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపట్టాన్ని అందజేసిన ఆలయ ఈవో వెంకటేశు. తరువాత అగరంపల్లిలో బిజెపి కార్యాలయం ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలను కొనసాగుతుందని ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా…లిక్కర్, ఇసుక, మైనింగ్ లతో అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
గంగవరం మండలంలో జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమాన్ని ఎస్ఎల్బీ కళ్యాణమండపం లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథులు నాయకులు ప్రజల సమస్యలను తీర్చడం మా ప్రధాన అంశం. టోల్ ప్లాజా నెంబర్ 1902 కాల్ చేస్తే మీ పరిష్కారం అంటూ నాయకులు తెలుపుతున్నారు. స్పందన కార్యక్రమంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమంలో ప్రజల సమస్యలు తీరుస్తామని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జెడ్పీ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు చెప్పారు.
తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని కన్నవరం గ్రామంలో సోమవారం నాడు ఒకేరోజు మూడు గ్రావెల్ క్వారీ లు ప్రారంభించడంతో ఒక్కసారిగా 200 నుండి 300 టిప్పర్లు గ్రావెల్ క్వారీ మట్టితో తమిళనాడుకి తరలిస్తూ ఉన్నారు తద్వారా కన్నవరం , రాజుగుంట రాజుల కండ్రిగ మార్గం పూర్తిగా దెబ్బతిని పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ప్రయాణం చేయవలసి వస్తుందని గ్రామస్తులు ఆవేశానికి గురై కన్నవరం గ్రామంలోని గ్రావెల్ క్వారీలు మార్గం వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత మీడియాతో మాట్లాడుతూ మా కన్నవరం గ్రామంలో స్థానిక వైసీపీ నాయకుల అండదండలతో నడుపుతున్నటువంటి గ్రావెల్ క్వారీ యజమానులు వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో క్వారీ నిలిపేంతవరకు నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామంటూ మీడియా ద్వారా హెచ్చరించారు.కొందరు యువకులు టిప్పర్లు క్వారీలకు వెళ్లకుండా వెనక్కి తిరిగి పంపించేశారు.ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మా గ్రామంలో క్వారీలు నడపకుండా ఉండేందుకు అనుమతులు ఇవ్వకుండా మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా మరి మరి కోరుతున్నామని వారు వాపోయారు.






Total views : 194565