కాకినాడ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సెక్రటేరియట్ నుంచి పాల్గొన్న సీఎం జగన్. జనవరి నెలలో అమలు చేసే పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా. పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే దొరబాబు కి పిఠాపురం సీటు నిరాకరించిన సీఎం, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న దొరబాబు. అధికారులు నుంచి సమాచారం వచ్చిన స్పందించని ఎమ్మెల్యే.
East Godavari
తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో వైసిపికి షాక్. వైసిపి విధివిధానాల నచ్చకే పార్టీకి రాజీనామా. పి ఏ సి యస్ చైర్మన్ గాజింగం సత్తిబాబు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో వైసిపి పార్టీకి మరియు సొసైటీ చైర్మన్ పదవి రాజీనామా చేసిన ప్రముఖ వైసిపి నాయకుడు సొసైటీ చైర్మన్ గాజంగం సత్తిబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకవరంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో సుమారు 300 మంది అనుచర గణంతో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరతారని అయన తెలిపారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి మూడ్రోజుల పాటు కాకినాడ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పవన్ పార్టీ సమీక్షల్లో పాల్గొంటారు. ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై పవన్ ఈ పర్యటన ద్వారా ఓ స్పష్టత తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై జనసేన సోషల్ మీడియా విభాగం శతఘ్ని ఓ పోస్టు పెట్టింది. కాకినాడలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, సామాజిక సాధికారతే లక్ష్యంగా అభ్యర్థుల జాబితాపై జనసేనాని కసరత్తు చేయనున్నారని వెల్లడించింది. పవన్ కల్యాణ్ ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపింది. ఎన్నికల్లో పోటీకి 70 స్థానాలపై గురిపెట్టారని వివరించింది. టీడీపీతో కలిసి సామాజిక సాధికారతే లక్ష్యంగా జాబితా రూపొందించనున్నారని శతఘ్ని పేర్కొంది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో జనసేన బలంగా ఉందని స్పష్టం చేసింది. ప్రత్యర్థి పార్టీలోని సీనియర్ నేతలు జనసేన వైపు అడుగులు వేస్తున్నారని వెల్లడించింది.
Read Also..
Read Also..
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు చిన్న కుమార్తె పోతాబత్తుల నవీన గంగ, అల్లుడు లోకేష్ లు వారి కుమార్తె కుమారుడుతో టెక్సాస్ లో ఉంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీన గంగతో కలిసి తండ్రి పొన్నాడ నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులు టెక్సాస్ వెళ్లారు. టెక్సాస్ హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, సతీమణి సీతామహాలక్ష్మి, కుమార్తె పోతాబత్తుల నవీన గంగతో పాటు కుమారుడు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన పోన్నాడ నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది, సర్జరీ జరుగుతుంది.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామ శివారు దుర్గమ్మ తల్లి ఆలయ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలై వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మరొకరికి గాయాలయ్యాయి.
స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం శ్రీరాముని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరగనున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు దేశమంతటా అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన అక్షింతలు, అయోధ్య రామ మందిరం యొక్క రాముడు చిత్రపటం, కరపత్రం మొదలగునవి దేశమంతటా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి చేరే విధంగా పంచనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఈరోజు పి గన్నవరం వైనతేయ గోదావరి నది ఒడ్డున వెలసిన శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సమావేశమై కోనసీమ జిల్లా అంతా శ్రీరామ చంద్ర స్వామి వారి అక్షింతలు, చిత్రపటం మొదలుగునవి జనవరి ఒకటి నుండి ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. జనవరి 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో దేశమంతటా ఉన్న దేవాలయాలలో భజనలు, కళ్యాణాలు, హోమాలు, క్రతువులు చేయమని చెప్పడం జరుగుతుందని అదేవిధంగా ఆరోజు సాయంత్రం దేశంలో ఉన్న ప్రతి ఇంటి వద్ద తక్కువలో తక్కువగా కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతుందని అన్నారు. ఆ విధంగా జనవరి 22వ తేదీన ప్రతి ఇంటి వద్ద దీపాలను వెలిగించి 500 ఏళ్ల తర్వాత ప్రతి ఇంటి వద్ద ఆనందం వెళ్లి విరిసి మన హిందువుల కలలను సహకారం చేసుకోవాలని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంత పల్లి గ్రామ శివారులో ఉన్న స్వర్ణ దుర్గ ఆశ్రమం వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో త్రాచుపాము ప్రత్యక్షమైంది. స్వర్ణ దుర్గ ఆశ్రమంలో స్వర్ణ దుర్గమ్మ తల్లి ఆలయంతో పాటు శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నిత్యా అన్నదానం, కార్తీక మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆదివారం మార్గశిర ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి త్రాచు పాము ఒకటి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకుని పడగవిప్పి బుసలు కొట్టింది. ఉదయం నుంచి సుబ్రమణ్య స్వామిని చుట్టుకుని సర్పం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు అక్కడకు వచ్చి సుబ్రమణ్య స్వామి ఈ విధంగా వచ్చి తమ ఆశీస్సులు అందిస్తున్నారని నమస్కరించి వెళ్లిపోయారు.
పి గన్నవరం నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించిన అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ 13వ రోజు సమ్మెలో భాగంగా పి గన్నవరం తహసిల్దార్ కార్యాలయం నుండి త్రీ రోడ్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. అంగన్వాడీలకు ఫోన్ లు ఇచ్చాము. చీరలు పెట్టాము. సెల్ ఫోన్ లకు చార్జీలు ఇచ్చాము అని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్తున్నారు. ఫోన్లు మేము సొంతంగా వాడుకోవడానికి కాదని మా డ్యూటీ నిమిత్తం ఇచ్చారని అవి కూడా పనిచేయడం లేదని మా సొంత సెల్ ఫోన్లతో మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని వాపోతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు తమ నిరసనను ఆపబోమని తమ న్యాయపరమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యాశాఖ సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన తెలిపారు. ముమ్మిడివరంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా ఉద్యోగులు సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నిరసనకు యి.టి.ఎఫ్, ఎస్.టి.యి ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం తెలిపాయి.





Total views : 92878