చిత్తూరు జిల్లాలో 2015లో జరిగిన మేయర్ దంపతుల హత్య కేసులో ఆరు నెలల క్రితం నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 160 మంది సాక్షులు ఉండగా.. వారిలో 14 మంది ప్రభుత్వ ఉద్యోగులు సాక్ష్యం చెప్పడానికి నిరాకరించారు. వీరిలో 8 మంది వివిధ కారణాలు చూపుతూ సాక్ష్యం ఇవ్వకుండా తప్పించుకోగా, మరో 6 మంది తమ సాక్ష్యాన్ని మార్చినట్లు కోర్టు గమనించింది. సాక్ష్యం చెప్పని ఆ 14 మంది ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. నోటీసులకు సమాధానాలు సమర్పించినప్పటికీ, వారి వివరణలతో కోర్టు సంతృప్తి చెందలేదు. దాంతో ఆ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, సాక్ష్యాన్ని నిరాకరించడం మార్చడం వంటి చర్యలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ 14 మంది అధికారులపై ప్రైవేటు కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.
Andhra Pradesh
ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ న్యాయమూర్తి. ఈ నెల 21 వరకు ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఆంతో ఆమెను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
శాంతికి సంబంధించి విజయవాడ, తాడేపల్లి సహా మొత్తం 3 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. విలువైన డాక్యుమెంట్స్, బ్యాంక్ లాకర్లు, నగదు, ఇతర ఆస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనం, 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి, అలాగే 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షల రూపాయలను గుర్తించారు. అంతేకాకుండా వోక్స్వ్యాగన్ పోలో కారు, ఓ బైక్ను కూడా గుర్తించారు. అక్రమాల ఆరోపణలతో 2024 జులై నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్లో ఉన్న శాంతి, ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. ఐతే గత ప్రభుత్వం అండతో శాంతి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదులతో సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఏపీ సీఎం చంద్రబాబు రహదారులు, భవనాలు, రవాణాశాఖపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. నగరంలో అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగాల్లో చేపట్టిన సంస్కరణల వల్ల అమరావతి భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అమరావతి ఒక ప్రధాన గ్రోత్ ఇంజిన్గా మారుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాల విస్తరణతో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి సమతుల్య అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన వెల్లడించారు.
ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ న్యాయమూర్తి.
ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ న్యాయమూర్తి. ఈ నెల 21 వరకు ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు నిన్న అరెస్టు చేశారు. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఆంతో ఆమెను అరెస్టు చేసి రాత్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
శాంతికి సంబంధించి విజయవాడ, తాడేపల్లి సహా మొత్తం 3 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. విలువైన డాక్యుమెంట్స్, బ్యాంక్ లాకర్లు, నగదు, ఇతర ఆస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనం, 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి, అలాగే 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షల రూపాయలను గుర్తించారు. అంతేకాకుండా వోక్స్వ్యాగన్ పోలో కారు, ఓ బైక్ను కూడా గుర్తించారు.
అక్రమాల ఆరోపణలతో 2024 జులై నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్లో ఉన్న శాంతి, ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. ఐతే గత ప్రభుత్వం అండతో శాంతి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదులతో సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘‘ఆడుదాం.. ఆంధ్రా’’ పేరిట సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ముప్పయి పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అవినీతిలో అప్పటి క్రీడాశాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్చార్జి ఎండీ హర్షవర్ధన్పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేశ్కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్చంద్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వాణీమోహన్పైనా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్లోని ఐటీ విభాగంలో పనిచేసే వారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎన్నికలకు ముందు ఓట్ల కోసమే వైసీపీ నేతలు ఆడుదాం.. ఆంధ్రా పేరిట యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించి అవకతవకలు కు పాల్పడ్డారని నివేదికలో స్పష్టం చేశారు. నిధులు పక్కదారి పట్టించి జేబులు నింపుకున్నారు. శాప్ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. ఆడుదాం.. ఆంధ్రా పేరిట మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ చేశారువిజిలెన్స్ అధికారులు.
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట నదీపాయపై నిర్మించిన దిండి..
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట నదీపాయపై నిర్మించిన దిండి – చించినాడ బ్రిడ్జి మరమ్మతు పనుల్లో ఎన లేని జాప్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఈ వారధిపై బస్సులు, భారీ వాహనాలు వంటివి ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎప్పటికీ ఈ వారధి మరమ్మతు పనులు పూర్తవుతాయో జాతీయ రహదారుల శాఖ అధికారులు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి దిండి-చించినాడ మధ్య భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో… రాజోలు, అటు పాలకొల్లు, నరసాపురం, ఇటు అమలాపురం డిపోల నుంచి బస్సులన్నీ రావులపాలెం, సిద్ధాంతం మీదుగా వెళుతున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల వారధిగా ఉన్న ఈ వంతెన పైనుంచి స్కూళ్లు, కాలేజీల బస్సులు వందకు పైగానే నిత్యం నడుస్తుంటాయి. అయితే బస్సుల రాకపోకలు నిలిపివేయడం వల్ల విద్యార్థులు ఇరువైపుల నుంచి కాలినడకన నడిచి వంతెనకు అటు, ఇటు ఉంచిన వాహనాలపై కాలేజీలకు వెళ్లవల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ వారధి పనులు ఎప్పటికి పూర్తవుతాయో N H అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో ప్రజలు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శాఖ ఆధునికీకరణలో భాగంగా మొత్తం 252.93 కోట్లతో చేపట్టిన ప్రణాళికలో తొలి దశగా 33.25 కోట్ల విలువైన నూతన వాహనాలు, అత్యాధునిక పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జెండా ఊపి కొత్త వాహనాలను సేవలకు అంకితం చేశారు. అధికారులు కొనుగోలు చేసిన పరికరాలు, వాహనాల పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. తొలి విడతలో భాగంగా 18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, 10 కోట్లతో హై ప్రెషర్ పంపులు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 2.49 కోట్లతో 50 అత్యవసర రబ్బర్ బోట్లు, 2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను ప్రభుత్వం సమకూర్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించుకుని ఈ పరికరాలను అందుబాటులోకి తెచ్చిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. రాజధానితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాల నిర్మాణాలు పెరుగుతున్నందున, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు. గతంలో అగ్నిమాపక విభాగంలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేదని, మళ్లీ అదే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సైతం సహాయం చేసిన ఘనమైన చరిత్ర ఏపీకి ఉందని గుర్తుచేశారు. అన్ని సవాళ్లను అధిగమించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమర్ధంగా సద్వినియోగం చేసుకుని అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి , పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఆకాశం నుంచి పడుతున్న నిప్పు కణాలు సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగుల ధాటికి 9 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ప్రకృతి ప్రకోపం ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. గత రెండు మూడు రోజులుగా ఏపీని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం అన్నదాతల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. కేవలం రెండు రోజుల్లోనే పిడుగుపాటుకు గురై 9 మంది మృత్యువాత పడ్డారు. సోమవారం ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పొలం పనులకు వెళ్లిన వారు, బయట ఉన్న వారు పిడుగుల బారిన పడి ప్రాణాలు విడిచారు. పుల్లలచెరువులో పిడుగు పడిన ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు విజయనగరం జిల్లా వంగరలో పొలంలో పని చేస్తున్న ఇనముల నర్సమ్మ అనే మహిళా రైతు పిడుగు తాకడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. అంతకుముందు ఆదివారం కూడా విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పొలం పనులకు వెళ్లిన తల్లి కూతుళ్లు విగతజీవులుగా మారడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. వరుస మరణాలతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి త తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. వాతావరణం అనుకూలించని సమయంలో చెట్ల కిందకు, విద్యుత్ స్తంభాల దగ్గరకు వెళ్లవద్దని.. రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.
ఏపీ రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో అమరావతి చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా మారింది.
అమరావతిని రాజధానిగా గుర్తించాలని మార్చి 28న ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1న లోక్సభ, ఏప్రిల్ 2న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఈ సవరణతో 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో మార్పులు చేసి “కొత్త రాజధాని ఉంటుంది” అనే పదం స్థానంలో “అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది” అని చేర్చారు. దీనిపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇది చారిత్రాత్మక రోజు. రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని కల అధికారికంగా సాకారమైంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, బిల్లుకు మద్దతిచ్చిన ఎంపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి మార్గం సుగమం చేసిన అమరావతి రైతుల ఓర్పు, త్యాగాలకు ప్రత్యేక వందనాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో రాజధాని మార్పుపై భవిష్యత్తులో ఎలాంటి సవరణ చేయాలన్నా అది పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది.





Total views : 33598