Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్….

సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్….

by Prakash
Yuvagalam Padayatra

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరిగి ప్రారంభించిన యువగళం పాదయాత్ర గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. అధికార పార్టీ వైఫల్యాలను, అక్రమాలను లోకేశ్ ఎండగడుతున్నారు. రెండో రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్​ రెడ్డి​పై విమర్శలు వర్షం కురిపించారు. ముమ్మిడివరం యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. పేదల కడపు నింపేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లను మూసివేసి సీఎం జగన్ పైశాచికానందం పొందారని విమర్శించారు. పాదయాత్రలో అన్నా క్యాంటీన్‌ను వార్డు సచివాలయంగా మార్చడని గమనించిన లోకేశ్‌.. అక్కడే నిలబడి సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం ముమ్మడివరంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ భవనాన్ని, ప్రస్తుతం వార్డు సచివాలయంగా మార్చేశారని మండిపడ్డారు

Advertisements

You may also like

Our Visitor

013943
Total views : 78613

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.