Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికే ఈ సభ..

ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికే ఈ సభ..

by Rama
siddham

తగరపువలసలో జరగనున్న సిద్ధం బహిరంగ సభ సన్నాహక సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు నెలల్లో రాబోతున్న ఎన్నికలకు అందరూ సమాయత్తం అవ్వాలన్నారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ , 5 ఎంపి స్దానాలను గెలిపించుకొవాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్న ప్రతిపక్షాలు కుళ్ళు కుతంత్రాలతో దుమ్మెత్తి పోస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికి, కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించడానికి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిద్ధం సభలో అన్ని పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. 175 నియోజకవర్గాల్లో ఇటువంటి సభలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

014548
Total views : 80454

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.