37
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సైకిల్పై కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.నియోజకవర్గ స్థాయిలో టాప్-3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మొబైల్ ట్యాబ్లు అందజేయగా… 530కి పైగా మార్కులు సాధించిన సుమారు 120 మంది విద్యార్థులకు పుస్తకాలు, మెమెంటోలు బహుకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభలో ఎక్కడా తగ్గిపోరని, సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.





Total views : 80268