Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh ‘రాజధాని ఫైల్స్’ విడుదలపై ఏపీ హైకోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ

‘రాజధాని ఫైల్స్’ విడుదలపై ఏపీ హైకోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ

by Satya
Capital files

‘రాజధాని ఫైల్స్’ చిత్రం విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశాలను ఇచ్చింది. గురువారం సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా సన్నివేశాలు ఉన్నాయంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ఉద్దేశంతోనే సినిమాను తీశారని పిటిషన్ లో ఆయన ఆరోపించారు. నిర్మాతల తరపు న్యాయవాది కోర్టుకు తన వాదనలు వినిపించారు. సెన్సార్ రివిజన్ కమిటీ సూచించిన మార్పులను చేశామని, వారు సూచించినట్లు సన్నివేశాలను తొలగించామని చెప్పారు. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. డిసెంబర్ లో తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే… వైసీపీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని భాను శంకర్ దర్శకత్వంలో రవిశంకర్ కంఠమనేని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

Read Also..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..
    ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్…
  • అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..
    అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్‌డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…
  • తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..
    గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మారిస్‌పేట కాలువ కట్ట వద్ద ఉన్న ‘సూర్య శిల్పశాల’లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎంతో శ్రమించి తయారు చేసిన అనేక విలువైన…

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

012570
Total views : 75423

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.