45
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హిందూ సామ్రాజ్య దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో ‘శౌర్య యాత్ర’ ఘనంగా నిర్వహించారు. చినఅమిరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ అడ్డవంతెన, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ మీదుగా సాగి రామాలయం వద్ద ముగిసింది. ముగింపు సభలో శివాజీ మహారాజ్ దేశ గౌరవానికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు.





Total views : 180026