రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా.. ఖనిజ సంపదను సమర్థవంతంగా వాడుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తీరప్రాంతంలోని బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, అలాగే ముడి ఇనుము లాంటి విలువైన ఖనిజాలను నేరుగా కాకుండా.. వాటికి వ్యాల్యూ అడిషన్ అంటే విలువ ఆధారిత ప్రక్రియలను జోడించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన మినరల్ వెల్త్ అంటే ఖనిజ సంపద ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ను ఎలా పెంచుకోవచ్చనే అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలన్నింటినీ నిశితంగా అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
గనుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.
187