Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Health జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా

by Satya
Digestive problems

అజీర్తి, అజీర్ణం పేరు ఏదైనా ఎక్కువమందిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్య. మంచి ఆకలి మీద ఆహారాన్ని తీసుకున్నా కొందరికి త్వరగా జీర్ణం కాదు. ఇలా జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే మంచిది. జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పరగడుపున ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటే మంచిది. అజీర్ణంతో పాటూ కడుపులో వికారం కూడా తగ్గిపోతుంది. అల్లం రసం తాగలేని వాళ్లు కూరల్లో కలిపి తినొచ్చు. ముడి బియ్యం, ఓట్స్, గోధుమలలాంటి తృణ ధాన్యాలతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది. కీరదోస వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ఉండే కాల్షియం, ఫోలేట్, విటమిన్ సి, ఎరెప్సిన్‌లు శరీరానికి చల్లదనంతో పాటూ గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అరటి పండ్లు తింటే మంచిదే రోజూ ఆహారంలో ఓ అరటి పండు తీసుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణసమస్యలను దూరం చేస్తాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం పోతుంది. పెరుగు కూడా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ పెరుగును తీసుకుంటే జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా పోయి మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా రావు. జీర్ణ సమస్యలకు కివీ పండ్లు కూడా చెక్ పెడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గిపోతుంది. పాప్‌కార్న్ తీసుకున్నా మంచిదే. పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్ అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

006953
Total views : 46189

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.