Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Devotional చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయం చరిత్ర

చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయం చరిత్ర

by Satya
History of Chaturmukha Brahma Lingeswara Swamy

బ్రహ్మ లింగేశ్వర స్వామిభారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్రకలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి.ఆ ఆలయంలో బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం ఉన్నందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంతం బలి ఘట్టంగా పేరుగాంచింది. బ్రహ్మచే ప్రతిష్టింపబడిన ఈ శివలింగానికి ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతాయి. బ్రహ్మ లింగేశ్వర స్వామి హిరణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహ రూపంలో భూమిని చేరుకునే పయనించడం వల్ల ఆ సమయంలో బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తి కోరగా వరాహ రూపంలో ఉన్న విష్ణు. ఈ మార్గం గుండా నదిని ఏర్పడటంతో వరహానది గా పేరుగాంచి నట్లు చెబుతున్నారు. ఈనది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ, ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మ లింగేశ్వర స్వామిబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు, పైకప్పులు సైతం రాతితో నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈదేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు. సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగు వైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురం దేవాలయ నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు. బ్రహ్మ లింగేశ్వర స్వామిఇక్కడి ఆలయం త్రిశూల పర్వతంపై ఉంది. సమీపంలో విభూతి గనులు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది.దేవాలయానికి గల ఆస్తులు నిత్య ధూప, దీప, నైవేద్యాలను సమకూర్చుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. బ్రహ్మ లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, ఏకవార అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. బ్రహ్మ లింగేశ్వర స్వామి ఈ శివలింగానికి ప్రతి సోమవారం భక్తులు వచ్చి అభిషేకాలు చేయించుకున్నారు. అలాగే ప్రతి ఏటా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్న పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆయా పర్వదినాల్లో లక్షలాదిమంది ఉత్సవాలలో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఆ దగ్గర భీమేశ్వరాలయం, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయం క్రీ.శ. మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణేలు. బ్రహ్మ లింగేశ్వర స్వామి తొట్టతొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది.లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేది.మొదట ఇక్కడ కుమార స్వామి గుడి, పూజ ఉండేవిట. అప్పట్లో చౌడేశ్వరి, గణపేశ్వర ఆలయం నిర్మించారు. తర్వాత భీమేశ్వరాలయం. ఈ భీమేశ్వరాలయం క్రీ.శ. రెండవ శతాబ్ది కి చెందినది. ఈ గుడికి జీర్ణోద్ధరణ ప్రక్రియ నిమిత్తం బాగు చేస్తుంది. రెండువేల ఏళ్ల సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి.

Advertisements

You may also like

Our Visitor

025657
Total views : 147626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.