విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయం జగత్ప్రసిద్ధమైంది. ఈ దేవాలయం కాకుండా, ఇక్కడ మరో కనకదుర్గాదేవి గుడి ఉంది. ఈ అమ్మవారి ఆలయం మొగల్రాజపురం కొండమీద ఉంది. కొండ పూర్తిగా ఎక్కకముందే, సుమారు 500 మెట్లు ఎక్కిన తర్వాత ఆలయ మండపం ఎదురౌతుంది. గుడి మండపం వద్ద ఒక సొరంగం ఉంది. అందులో కనకదుర్గాదేవి దర్శనమిస్తుంది. ఇక్కడ ఎలాంటి హడావుడి, ఆర్భాటము కనిపించదు. సిసలైన భక్తులు కోరుకునే ప్రశాంత చిత్తం అనుభూతికొస్తుంది. విజయవాడ దుర్గమ్మ వెలసిన మొదటి మొగల్రాజపురం కొండ మీదేనని, అయితే, ఇక్కడి కంటే ఇంద్రకీలాద్రి కొండమీద అయితే మరింత శోభాయమానంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పెద్ద గుడి కట్టించారని అంటారు.
Devotional
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నాలుగు రోజుల పాటు గన్నవరంలో శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈనెల 7 వ తారీఖు నుండి 10 వ తారీకు మధ్యాహ్నం వరకు ఈ యాగం నిర్వహించనున్నట్లు వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ దాదాపు నాలుగు రోజులు పాటు ఈ యాగం గన్నవరంలో నిర్వహించనున్నాము. యాగం నిర్వహించడానికి ప్రధాన కారణం అక్షర కమలం ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అధోగతి పాలవుటమే, ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ రాష్ట్రా అభివృద్ధిని మళ్ళి గాడిలో పెట్టాలన్న పడిపోయిన ఆస్తుల విలువలు పెరగాలన్న ఐటీ ఉద్యోగాలు రావాలన్న ఉపాధి అవకాశాలు పెరగాలన్న పరిశ్రమలు రావాలన్న ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా కావటం తక్షణ అవసరం అని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దేవుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు కి ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాజమండ్రి కి చెందిన అర్చకులు, వృత్వికులు, వేద పండితులు 30 మందితో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని భావిస్తూ ప్రజలు ఆయనకి అవకాశం ఇస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
శ్రీకాకుళం, ఆరోగ్య ప్రదాత, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని ఇంద్ర పుష్కరిణి వద్ద సామూహిక సూర్యనమస్కారముల కార్యక్రమం ఘనంగా జరిగింది. వందలాది మంది జిల్లాలో ఉన్న యోగా విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జిల్లాలోని అరసవల్లి ఆలయ ప్రాంగణంలో అధికారులు, యోగా మాస్టర్లు ఆధ్వర్యంలో సూర్యనమస్కారములు నిర్వహించారు. 12 సెట్లగా విద్యార్ధినీ విద్యార్ధులు సూర్యనమస్కారములు చేశారు. ఒక్క సూర్యనమస్కారములే కాకుండా వివిధ రకముల యోగాసనాలను చేశారు. ఆర్ట్ ఫుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయుష్ శాఖ అధికారి అన్నారు. మకర సంక్రాంతి పండగను పురష్కరించుకొని సూర్యనమస్కారముల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యోగా విద్యార్ధులు పాల్గొన్నారు. మొత్తం 5 సెషన్స్ గా నిర్వహించడం జరిగిందన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలను రద్దు చేసింది. సంక్రాంతి సందర్భంగా 14న శ్రీ గోవిందరాజులస్వామివారి ఆలయంలో భోగితేరు, 15న మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. 14న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగిస్తారు. 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. అదే రోజు గోదా పరిణయోత్సవం కూడా ఉంటుంది. ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెదజీయర్ మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారికి సమర్పిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేస్తారు. ఆస్థానం, పార్వేట కార్యక్రమాల అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీడీడీ రద్దు చేసింది. శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి.
Read Also..
జాగర్లమూడి సంగమేశ్వర దేవస్థానం చాలా పురాతనమైంది. ఈ గుడి గుంటూరు జిల్లాలో ఉంది. సంగమేశ్వర దేవస్థానం చుట్టూ సువిశాలమైన ఆవరణ ఉంది. ఈ చారిత్రక దేవస్థానం విశిష్టంగా ఉంటుంది. ఒకపక్కన ప్రాచీనతను ప్రతిబింబిస్తూ మరో పక్కన అపురూపమైన శాంతి నిలయంలో ప్రవేశించిన భావన మనసులో నింపుతుంది. ఆలయ ప్రాంగణం లోంచి దేవస్థానంలోకి దారి తీస్తే, మున్గుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. తూర్పుముఖంగా ఉన్న ఆలయ గర్భగుడిలో సంగమేశ్వరుడు ఉండగా, కుడివైపున విఘ్నేశ్వరుడు, ఎడమవైపున కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తారు. గుడి ప్రాంగణంలో తూర్పుదిక్కున ప్రాకారానికి దగ్గర్లో పెద్ద సత్రం, ఆఫీసు ఉన్నాయి. ఉత్తర దిక్కున నాగ ప్రతిమలు, కాలభైరవుని విగ్రహం, యజ్ఞశాల ఉన్నాయి. దక్షిణ దిక్కులో కళ్యాణ మండపం, వీరభాద్రేస్వరాలయం,పార్వతీదేవి ఆలయం, పాప వినాశాకేశ్వరాలయం, నవగ్రహాలు కనిపిస్తాయి. ఇంకా ఈ గుడిలో అనేక చెట్లు, పాకశాల మొదలైనవి ఉన్నాయి. దాదాపు మన ప్రాచీన దేవాలయాలన్నీ దేవుడు ఆ ప్రాంతీయులు ఎవరి కలలో నయినా కనిపించి ఫలానా ప్రదేశంలో తనకు ఒక ఆలయం కట్టించమని చెప్పి కట్టించుకున్నవే. కొన్ని మాత్రం పూర్వ మహర్షులు తపస్సు చేసిన పుణ్యభూమిలో కట్టినవి. గుంటూరు జిల్లా జాగర్లమూడి సంగమేశ్వర దేవస్థానం కొలువైన ప్రదేశంలో అత్రి మహర్షి సుదీర్ఘ కాలంపాటు తపస్సు చేశాడట. తర్వాత ఆ పుణ్యభూమిలో సంగమేశ్వర స్వామికోసం ఆలయం కట్టించాడట. అత్రి మహాముని కట్టించి నదేవస్థానం శిథిలావస్థకు చేరగా, 17వ శతాబ్దం నాటి వెలమ రాజులు ఈ సంగమేశ్వర దేవాలయాన్ని పునర్నిర్మించారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
Read Also..
Read Also..
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఒక వింత ఆచారాన్ని కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామస్తులు పాటిస్తున్నారు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయ స్వామి పొంగళ్లను ఘనంగా మగవారు చేస్తారు. ఈ దేవాలయంలో స్వామివారికి పూజలు గాని ప్రసాదాలు గాని పొంగలి పెట్టడం గాని అన్ని మగవారి చేతి నుంచి జరుగుతాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆ గ్రామ ఆనవాయితీ. పూర్వం ఆ గ్రామంలో కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు ఆంజనేయ స్వామి రూపంలో ఒక సాధువు కనిపించి తన రూపం ఒక శిలా పథకం మీద బీజాక్షరాలతో రాసి ఉన్నాయి అది తెచ్చి మగవారు మాత్రమే ఈ గ్రామంలో పూజలు చేయండి మీరు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉంటారని తెలిపారు. ఆనాటి నుండి ఆ గ్రామ ప్రజలు అదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలోకి వెలుపల నుంచే స్త్రీలు స్వామివారిని దర్శించుకోవడం చేయాలి. అలా చేయడం వల్ల ఆ గ్రామ ప్రజలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉంటారని వారి నమ్మకం.
గుంటూరు జిల్లా మంగళగిరి ఆలయాల్లో నారా లోకేష్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆదివారం ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాన్ష్తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
Read Also..
Read Also..
ప్రపంచం మొత్తం నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షించే పవిత్ర స్థలం లార్డ్ రాముడు (శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం) నివాసం. దక్షిణ దిశలో ప్రవహించే పవిత్రమైన గోదావరి ఈ ప్రదేశంలో ప్రసిద్ది చెందిన భద్రాగిరి మేరు మరియు మెనాకా యొక్క వంశ పితామహుడు. ఇతిహాసం ప్రకారం, ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత రామాయణ కాలం నాటిది. రామాయణ కాలంలో దండకారణ్యంలో ఈ పొరుగింటి కొండ ప్రదేశం ఉనికిలో ఉంది. ఇక్కడ రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడు వారి వానావాసా మరియు పార్శ్శలాల గడిపారు. ఈ ఆలయ ప్రదేశం సమీపంలో కూడా. ఇది ఈ మందిర్ ప్రదేశంలో ఉంది, రామావతారానికి పూర్వం భగవాన్ మహావిష్ణు, భగవాన్ శ్రీ రామచంద్ర మూర్తి యొక్క ప్రార్థన కోసం యుగస్ ద్వారా తన తపతులను కొనసాగించిన అతని భక్త భద్ర కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి రామగా మళ్ళీ తనకు ప్రత్యక్షమయ్యాడు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ తన్నీరముదు ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబి వారికి మేల్ చాట్ శేషవస్త్రాన్ని సమర్పించారు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ వేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్ రామానుజాచార్యులవారికి మేనమామ. ఈ కార్యక్రమంలో తిరుమల జీయంగార్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గత 11 రోజులుగా కొనసాగుతున్న చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞం నేటి తో దిగ్విజయంగా ముగిసింది. రుత్వికుల మంత్రోచ్చారణనలతో శ్రీ వాసుదేవానంద స్వామి సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమం జయప్రదంగా పూర్తయింది. సి వి అర్ గ్రూప్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావటం మహా భాగ్యమని పండితులు తెలిపారు.