Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh శత చండీ యాగం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్…

శత చండీ యాగం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్…

by Prakash
Sata Chandi Yagam

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నాలుగు రోజుల పాటు గన్నవరంలో శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈనెల 7 వ తారీఖు నుండి 10 వ తారీకు మధ్యాహ్నం వరకు ఈ యాగం నిర్వహించనున్నట్లు వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ దాదాపు నాలుగు రోజులు పాటు ఈ యాగం గన్నవరంలో నిర్వహించనున్నాము. యాగం నిర్వహించడానికి ప్రధాన కారణం అక్షర కమలం ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అధోగతి పాలవుటమే, ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ రాష్ట్రా అభివృద్ధిని మళ్ళి గాడిలో పెట్టాలన్న పడిపోయిన ఆస్తుల విలువలు పెరగాలన్న ఐటీ ఉద్యోగాలు రావాలన్న ఉపాధి అవకాశాలు పెరగాలన్న పరిశ్రమలు రావాలన్న ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా కావటం తక్షణ అవసరం అని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దేవుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు కి ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాజమండ్రి కి చెందిన అర్చకులు, వృత్వికులు, వేద పండితులు 30 మందితో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని భావిస్తూ ప్రజలు ఆయనకి అవకాశం ఇస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

Advertisements

You may also like

Our Visitor

023055
Total views : 140797

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.