తిరుపతి రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు వైసీపీ కి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. వీరంతా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో చేరుతున్నట్లు ప ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆవిలాల పంచాయతీకి చెందిన మాజీ జెడ్పిటిసి సుభాషిని,కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. చెవిరెడ్డి కుటుంబ పాలన తమకు గుర్తింపు ఇవ్వడంలేదంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు వాపోయారు. ఆత్మాభిమానం, గౌరవం కోసం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పులివర్తి నాని వెంట నడిచేందుకు సిద్దమయ్యామని తెలిపారు.
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.