టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. నగరి వైసీపీ ఎమ్మెల్యే మంత్రి రోజా వేసిన ప్రైవేటు కేసు విచారణలో భాగంగా నగరి జిల్లా కోర్టుకు టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ హాజరయ్యారు. కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిడిపి నాయకులను, కార్యకర్తలను వేధించి వారి మీద కేసులు పెట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని గాలి వదిలేసారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, రూల్ ఆఫ్ లా ప్రకారం కాకుండా తనదైన సైకో పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పై ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు, ఎలాంటి ఆధారాలు లేకుండా అయనను జైల్లో నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు. కోర్టు మొట్టికాయలు వేసింది. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత ధూషనలకు వెళ్ళారు. కుటుంబంలో మహిళను టార్గెట్ చేశారు, దానికి దీటుగా టిడిపి నాయకులు వ్యవహరిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించి జైలులకు పంపిస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. అందరినీ బెదిరించి, బయపెట్టి అధికారంలో ఉండాలని జగన్ చూస్తున్నాడు. ఇక నాపైనా గుంటూరు, నగరి నుండి చాలా చోట్లు దోంగ కేసులు పెట్టారు. నెల రోజుల్లో చంద్రబాబు, పవన్ పాలనా వస్తుందని, జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వారిద్దరూ పనిచేస్తారు అన్నారు. ఎన్నికల తరువాత జగన్ రాష్ట్రంలో ఉండడని, జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలు అని అన్నారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని, రోజా ముందు తన నోరును సరిచేసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులే ఉంటారని, తెలుగుదేశం జెండాను చనిపోయే వరకు భుజాన మోస్తూనే ఉంటామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు.
Telugu Desam Party
ఈ నెల కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా సభను విజయవంతం చేయాలని జనసేన రాష్ట్ర పి. ఏ. సి సభ్యులు రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ కోరారు. కాకినాడ గుడారీ గుంట పంతం నానాజీ నివాసంలో జనసేన నాయకులతో కలిసి ఛలో తుని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన, టి.డి.పి పార్టీల పొత్తు కుదిరిన తర్వాత మొట్ట మొదటిసారిగా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ సభను తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వై.ఎస్.అర్ రహిత ఆంధ్రప్రదేశ్, వై.ఎస్.అర్ రహిత కాకినాడ జిల్లా ప్రధాన అంశంగా ఇద్దరు అది నాయకులు తీసుకున్న నిర్ణయం తో తెలుగుదేశం పార్టీ నిర్వహించే చంద్రబాబు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. వై.సి.పి ముక్త ఆంధ్రప్రదేశ్ కై ఛలో తుని సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నాలుగు రోజుల పాటు గన్నవరంలో శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈనెల 7 వ తారీఖు నుండి 10 వ తారీకు మధ్యాహ్నం వరకు ఈ యాగం నిర్వహించనున్నట్లు వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ దాదాపు నాలుగు రోజులు పాటు ఈ యాగం గన్నవరంలో నిర్వహించనున్నాము. యాగం నిర్వహించడానికి ప్రధాన కారణం అక్షర కమలం ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అధోగతి పాలవుటమే, ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ రాష్ట్రా అభివృద్ధిని మళ్ళి గాడిలో పెట్టాలన్న పడిపోయిన ఆస్తుల విలువలు పెరగాలన్న ఐటీ ఉద్యోగాలు రావాలన్న ఉపాధి అవకాశాలు పెరగాలన్న పరిశ్రమలు రావాలన్న ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా కావటం తక్షణ అవసరం అని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దేవుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు కి ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాజమండ్రి కి చెందిన అర్చకులు, వృత్వికులు, వేద పండితులు 30 మందితో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని భావిస్తూ ప్రజలు ఆయనకి అవకాశం ఇస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పూనుకున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల మండలం మురుకుండపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ వివరించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ… ప్రజలలో వైసిపి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైందని రాబోయే రోజులో వైసీపీ ప్రభుత్వ పతనము అవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లో మురుకుండపాడు గ్రామము నందు ఒక్క అభివృద్ధి పని జరిగినట్లు కూడా చెప్పట్లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వములో రోడ్లు వేసి అభివృద్ధి చేశామన్నారు. గత కొన్ని రోజుల క్రితం గ్రామములో విష జ్వరాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు కానీ వైసిపి ప్రభుత్వం కనీసం వారిని పట్టించుకోలేదన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని కచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనకు తగిన గుణపాఠం చెపుతారన్నారు. మీ అందరికి తను అండగా ఉంటానని మురుకుండపాడు గ్రామాన్ని అభివృద్ధి చేసే భాద్యత తనదని హామీ ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో గంటా నరహరి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సందర్భంగా అన్న క్యాంటీన్ ఘనంగా ప్రారంభం అయింది. అన్నా క్యాంటీన్ ముఖ్య అతిధిగా హాజరైన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు. రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ద్వారా భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్ని కూడా క్లోజ్ చేయించారు. కానీ ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి దాదాపుగా నా సొంత ఖర్చుతో 8 అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నాను. పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటున్న గంట నరహరి సోమవారం నూతన సంవత్సర వేడుకల సందర్బంగా చంద్రన్న తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్ రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి చేతుల మీదుగా నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలతో పాటు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా గంటా నరహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బంధులుకు గురవుతున్నారని తెలిపారు. ఈ సైకో పాలన అంతం కావాలంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also..
Read Also..
రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహాల్ మండలం పాత హడగలి గ్రామంలో తెదేపా పోలిట్ సభ్యులు మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ హనుమంతుతో పాటు, 30 కుటుంబాలు సోమవారం వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వైకాపా నాయకులకు కాలవ శ్రీనివాసులు తెదేపా కండువాలు కప్పి తమ పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. పాత హడగలి గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుందని , తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో వైకాపా పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కాలవ శ్రీనివాసులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డి హీరే హాల్ మండల తెదేపా కన్వీనర్ హనుమంత రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు కాదలూరు మోహన్ రెడ్డి, తెదేపా ఎంపీటీసీలు మొండి మల్లికార్జున, మురడి గంగాధర, మండల తెదేపా నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు, ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన తంబు శీను, వల్లభోని మల్లికార్జున, వల్లభోని వెంకటేశ్వర్లు, కొక్కిలిగడ్డ ప్రసాద్, కొక్కిలిగడ్డ వెంకట్రావు, కొక్కిలిగడ్డ కృష్ణారావు, నాయుడు రాజు, నాయుడు రాము, నాయుడు లక్ష్మణ్, నాయుడు సురేష్, పల్లెపాటి బాబులు, వల్లభోని నరసింహారావు లు పార్టీలో చేరగా… నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన వారికి పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తూ పాత, కొత్త నాయకులు అందరు కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే కందుకూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలను చూడలేక, వైసీపీ నుంచి అనేకమంది బయటికి వస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులను చూసాం. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి అశేష ప్రజానికం విజయనగరం వైపు రావడంతో జన సముద్రం గా మారినటువంటి పరిస్థితులు కనిపించాయని మహమ్మద్ నసీర్ తెలిపారు. తెలుగుదేశం వీర సైనికులు, జనసేన జన సైనికులు కదిలి వచ్చారని అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ గారు పాల్గొన్నారు. యువగలం రథసారథి అయిన నారా లోకేష్ గారు చేపట్టినటువంటి దాదాపు 226 రోజుల సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు దాదాపు 2100 గ్రామాలను ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనుక్కొని వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేశారని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం తను నిస్వార్ధంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బలపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారని వివరించినటువంటి తీరు అద్భుతం అన్నారు. సభకు వచ్చిన జన సంద్రాన్ని చూసి వైసీపీ మంత్రులకు, జగన్ మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. మంత్రి రోజా పవిత్రమైనటువంటి గుడిలో లోకేష్ గారి మీద వ్యంగంగా మాట్లాడడం సరికాదన్నారు. రోజా గారికి రోజులు దగ్గరపడ్డాయి ఆమె మంత్రిగా ప్రజలకు ఏం సేవ చేసిందో ఒక్కసారి చెప్పాలని అన్నారు. అలాగే వెల్లంపల్లి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు లోకేష్, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన వస్తోందో ప్రజలందరూ ఆలోచించాలని, పరదాలు కట్టుకుని తిరిగేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని తెలిపారు. ప్రజల్లో గుండె ధైర్యం కలిగిస్తూ ముందుకు సాగేటువంటి నాయకత్వం నారా లోకేష్ గారిది అందుకని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనసేన సైనికులు గాని మన అందరి నాయకుల సమక్షంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ తెలియజేశారు.
ఉత్తరాంధ్ర పసుపు సంద్రంగా మారిపోయింది.. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల జనాభా వస్తారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్రెడ్డి వారికి స్వాగతం పలికారు. వీరికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ స్వయంగా పలువురు అగ్రనేతలను ఆహ్వానించారు. పక్క రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.





Total views : 33611