ఈ నెల కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా సభను విజయవంతం చేయాలని జనసేన రాష్ట్ర పి. ఏ. సి సభ్యులు రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ కోరారు. కాకినాడ గుడారీ గుంట పంతం నానాజీ నివాసంలో జనసేన నాయకులతో కలిసి ఛలో తుని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన, టి.డి.పి పార్టీల పొత్తు కుదిరిన తర్వాత మొట్ట మొదటిసారిగా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ సభను తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వై.ఎస్.అర్ రహిత ఆంధ్రప్రదేశ్, వై.ఎస్.అర్ రహిత కాకినాడ జిల్లా ప్రధాన అంశంగా ఇద్దరు అది నాయకులు తీసుకున్న నిర్ణయం తో తెలుగుదేశం పార్టీ నిర్వహించే చంద్రబాబు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. వై.సి.పి ముక్త ఆంధ్రప్రదేశ్ కై ఛలో తుని సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
361
previous post




Total views : 78867