Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh చనిపోయే వరకు ఆ జెండాను భుజాన మోస్తూనే ఉంటా…

చనిపోయే వరకు ఆ జెండాను భుజాన మోస్తూనే ఉంటా…

by Prakash
Former TDP Minister Senior Leader Bandaru Satyanarayana

టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. నగరి వైసీపీ ఎమ్మెల్యే మంత్రి రోజా వేసిన ప్రైవేటు కేసు విచారణలో భాగంగా నగరి జిల్లా కోర్టుకు టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ హాజరయ్యారు. కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిడిపి నాయకులను, కార్యకర్తలను వేధించి వారి మీద కేసులు పెట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని గాలి వదిలేసారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, రూల్ ఆఫ్ లా ప్రకారం కాకుండా తనదైన సైకో పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పై ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు, ఎలాంటి ఆధారాలు లేకుండా అయనను జైల్లో నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు. కోర్టు మొట్టికాయలు వేసింది. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత ధూషనలకు వెళ్ళారు. కుటుంబంలో మహిళను టార్గెట్ చేశారు, దానికి దీటుగా టిడిపి నాయకులు వ్యవహరిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించి జైలులకు పంపిస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. అందరినీ బెదిరించి, బయపెట్టి అధికారంలో ఉండాలని జగన్ చూస్తున్నాడు. ఇక నాపైనా గుంటూరు, నగరి నుండి చాలా చోట్లు దోంగ కేసులు పెట్టారు. నెల రోజుల్లో చంద్రబాబు, పవన్ పాలనా వస్తుందని, జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వారిద్దరూ పనిచేస్తారు అన్నారు. ఎన్నికల తరువాత జగన్ రాష్ట్రంలో ఉండడని, జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలు అని అన్నారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని, రోజా ముందు తన నోరును సరిచేసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులే ఉంటారని, తెలుగుదేశం జెండాను చనిపోయే వరకు భుజాన మోస్తూనే ఉంటామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: