Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh పల్లె ఆధ్వర్యంలో జయహో.. బీసీ ల…బైక్ ర్యాలీ

పల్లె ఆధ్వర్యంలో జయహో.. బీసీ ల…బైక్ ర్యాలీ

by Prakash
Organized a bike rally

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి జయహో బిసి కార్యక్రమాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె బైక్ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభకు బయలుదేరారు. అమడగూరు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు BK పార్థసారధి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ మరియు బిసి అధ్యక్షుడు కుంటిమద్ది మాజీ ఎంపీపీ రంగయ్య, మరియు పెద్ద ఎత్తు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి, బికే పార్థసారథులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కి బీసీలు వెన్ను దన్నుగా నిలిచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టిడిపి హయాంలోనే బీసీలకు అధిక ప్రాధాన్యత నిచ్చి రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకుపోయిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039670
Total views : 199115

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: