శ్రీకాకుళం, ఆరోగ్య ప్రదాత, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని ఇంద్ర పుష్కరిణి వద్ద సామూహిక సూర్యనమస్కారముల కార్యక్రమం ఘనంగా జరిగింది. వందలాది మంది జిల్లాలో ఉన్న యోగా విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జిల్లాలోని అరసవల్లి ఆలయ ప్రాంగణంలో అధికారులు, యోగా మాస్టర్లు ఆధ్వర్యంలో సూర్యనమస్కారములు నిర్వహించారు. 12 సెట్లగా విద్యార్ధినీ విద్యార్ధులు సూర్యనమస్కారములు చేశారు. ఒక్క సూర్యనమస్కారములే కాకుండా వివిధ రకముల యోగాసనాలను చేశారు. ఆర్ట్ ఫుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయుష్ శాఖ అధికారి అన్నారు. మకర సంక్రాంతి పండగను పురష్కరించుకొని సూర్యనమస్కారముల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యోగా విద్యార్ధులు పాల్గొన్నారు. మొత్తం 5 సెషన్స్ గా నిర్వహించడం జరిగిందన్నారు.
ఘనంగా సామూహిక సూర్య నమస్కారముల కార్యక్రమం
377
previous post





Total views : 140944