Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home National మాజీ ఉప ప్రధాని అద్వానీకి అస్వస్థత

మాజీ ఉప ప్రధాని అద్వానీకి అస్వస్థత

by Rama
మాజీ ఉప ప్రధాని అద్వానీకి అస్వస్థత

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. అద్వానీ వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రెండు నెలల క్రితం కూడా అద్వానీ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. కాగా, అద్వానీ అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్వానీ తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.