Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Telangana తెలంగాణలో రేపటి నుంచే గ్రూప్-2 పరీక్షలు

తెలంగాణలో రేపటి నుంచే గ్రూప్-2 పరీక్షలు

by Rama
తెలంగాణలో రేపటి నుంచే గ్రూప్-2 పరీక్షలు

తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలనిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపు, ఎల్లుండి ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేసింది. గ్రూప్-2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. పేపర్-1 డిసెంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది. మరుసటి రోజు డిసెంబర్ 16న పేపర్​3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీజీపీఎస్సీ పలు కీలక సూచనలు చేసింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019184
Total views : 90068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.