బఫర్జోన్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశామని, కానీ ఆ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కొన్ని కట్టడాలను కూల్చినప్పుడు హైడ్రా బాగా పని చేసిందని కితాబునిచ్చారని, ఇప్పుడు మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారని వాపోయారు. తాము అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామన్నారు.
అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమీన్పూర్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఓ ఆసుపత్రిపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ అదేచోట మళ్లీ నిర్మించారని తెలిపారు. అమీన్పూర్లో ఆసుపత్రిని కూల్చేశారని చెబుతున్నారని, కానీ ఆ ఆసుపత్రిలో రోగులు ఎవరూ లేరని వెల్లడించారు.
ప్రజలు నివసిస్తున్న భవనాలను కూల్చలేదన్నారు. ఇటీవల కూకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణలను కూల్చివేశామని తెలిపారు. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొంతమంది ఖాళీ చేయలేదని తెలిపారు.
హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని గుర్తించాలన్నారు. హైడ్రాను బూచిగా చూడవద్దని, చూపించవద్దని కోరారు. ఎవరికైనా సమయం ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెరువులను, నాలాలను కాపాడుకోలేమన్నారు. ఆస్తుల రక్షణకే ముఖ్యమంత్రి హైడ్రాను తీసుకువచ్చారన్నారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్నారు.
హైడ్రాను ఏర్పాటు చేసి రెండు నెలలు అయిందన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను పరిరక్షించే బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం మన హక్కు అని, ప్రజల ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలోనే ఉందని వెల్లడించారు. పేదలను ఇబ్బంది పెట్టాలనేది హైడ్రా అభిమతం కాదన్నారు. కానీ అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంపెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను…
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
- శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులునంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు 40 కిలోమీటర్లు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తూ మల్లన్న దర్శనం కోసం వెళ్తున్నారు. Advertisements
- అసోంలో ప్రధాని మోదీ పర్యటనఅసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భారత ఎయిర్ఫోర్స్ విమానంలో వచ్చిన ప్రధాని..రోడ్డుపైనే ల్యాండ్ అయ్యారు. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి