ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈశ్వరీ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభమైంది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ పి సత్యనారాయణన్ వర్సిటీ పాలకమండలి సభ్యులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోరా అధ్యక్షతన జరిగిన సభలో విద్యార్థులు, ప్రొఫెసర్లను ఉద్దేశించి డాక్టర్ సత్యనారాయణన్ ప్రసంగించారు. తన తల్లి గారైన ఈశ్వరీ దేవి పేరున ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన లిబరల్ ఆర్ట్స్ స్కూల్ లో.అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధనను కొనసాగిస్తామన్నారు. బీఎస్సీ, బీఏ చదివే విద్యార్థుల కోసం వివిధ రకాల కోర్సులను ప్రవేశ పెట్టామనీ, సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ వంటి సబ్జెక్టుల్లో పీహెచ్ఎ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభిస్తున్నామన్నారు. వీటిని చదివేందుకు దూర ప్రాంతాలకు పరుగులు తీయకుండా ఆంధ్రాలోనే క్రమశిక్షణ గల విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు వెసులుబాటు కల్పించామన్నారు.
ఈశ్వరీ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభం…
314
previous post




Total views : 92872